Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠను రేపుతున్న అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (19:28 IST)
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 25 తేదీనే విచారణ చేపట్టాల్సివుండగా, న్యాయమూర్తి 26వ తేదీ బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం కూడా విచారణ చేపట్టారు. ఈ రోజు జాబితాలో లేదని, అందువల్ల రేపు విచారిస్తామని అవినాష్ తరపు న్యాయవాదులకు హైకోర్టు తెలిపింది. అదీకూడా గురువారం సాయంత్రం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని పేర్కొంది. దీంతో అవినాష్ బెయిల్ పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 
 
బుధవారం కోర్టు ప్రారంభంకాగానే అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, బుధవారం విచారణ జరిపే కేసుల జాబితాలో లేదని అందువల్ల విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి చెప్పారు. గురువారం విచారణ చేపట్టాలని న్యాయవాది కోరగా, అందుకు కోర్టు సమ్మతించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేసు విచారణ చేపడుతామని తెలిపింది. 
 
కాగా, అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్, ఆయనకు అనుకూలంగా జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments