Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వచ్చిన అతిథులతో రక్తదానం చేయించిన కొత్త జంట

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (11:44 IST)
పెళ్లికి వచ్చిన అతిథులతో కొత్త జంట రక్తదానం చేయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగింది. ఇంతకీ అసలు ఎందుకీ రక్తదానం చేసారు?
 
పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్‌ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దయాసాగర్ వివాహం అదే పట్టణానికి చెందిన పద్మసాయి కృష్ణవేణితో ఆదివారం రాత్రి 10.35 గంటలకు జరిగింది. ఐతే ఈ పెళ్లికి వచ్చినవారు తమను ఆశీర్వదించడంతో పాటు రక్తదానం కూడా చేయాలని వరుడు దయాసాగర్ కోరాడు.
 
దయాసాగర్ విన్నపాన్ని మన్నించిన బంధుమిత్రులు నవ దంపతులను ఆశీర్వదించి ఆ తర్వాత రక్తదానం ఇచ్చారు. తన అభ్యర్థన మేరకు రక్తదానం చేసిన 35 మంది బంధుమిత్రులకు అభినందన తెలియజేసింది కొత్త జంట. కాగా రక్తదానం చేయించిన వరుడు దయాసాగర్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments