Webdunia - Bharat's app for daily news and videos

Install App

300 వీధి కుక్కలకు విషం.. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు

Webdunia
శనివారం, 31 జులై 2021 (14:31 IST)
300 వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపేయడంతో జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు ప్రదర్శించి తీరు ఇప్పుడు దుమారం రాజేసింది. లింగపాలెం పంచాయతీ అధికారులు ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. 
 
మూగజీవాలను అత్యంత పాశవికంగా, ఎలాంటి కనికరం చూపకుండా విషపు ఇంజక్షన్లతో చంపేశారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 మూగజీవాలను పొట్టున పెట్టుకున్నారు. గుంతలో అలా పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. ఇది చూసిన జంతు ప్రేమికులు కంటతడి పెట్టుకుంటున్నారు.
 
విశ్వాసానికి మారుపేరు గ్రామసింహాం. కొన్ని సందర్భాల్లో మనుషులపై దాడి చేయవచ్చు, తీవ్రంగా గాయపరచవచ్చు. అయితే మాత్రం అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తారా? వాటిని వదిలించుకునేందుకు ఏకంగా చంపేస్తారా? వాటిపై విషం చిమ్ముతారా అంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. చనిపోయిన కుక్కల కళేబారాలను చెరువు వద్ద గొయ్యిలో పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. 
 
కుక్కలను చంపే హక్కు ఎవరిచ్చారని ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్ ప్రశ్నిస్తోంది. ఈ చర్యలకు పాల్పడ్డ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments