Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో పడక సుఖం కోసం భర్తను స్కార్పియోతో తొక్కించి చంపిన భార్య

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (13:21 IST)
ఆ ఇల్లాలికి కట్టుకున్న ప్రియుడు కంటే... మధ్యలో వచ్చిన ప్రియుడే ముఖ్యమని భావించింది. పైగా, ప్రతి రోజూ ప్రియుడుతో పడక సుఖం పొందాలన్న ఆశ ఆమెను కిరాతకురాలిగా మార్చేసింది. ఫలితంగా కట్టుకున్న భర్తను స్కార్పియో వాహనంతో తొక్కించి చంపేసింది. ఈ దారుమం కర్నూలు జిల్లా మహానంది మండలంలోని తిమ్మాపూరం గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ముడావత్‌ తులసీనాయక్, సాలిబాయి అనే దంపతులు ఉండగా, వీరికి 17 యేళ్ల క్రితం వివాహమైంది. అయితే, నాలుగేళ్ల క్రితం కడప జిల్లా మన్యంవారిపల్లెకు చెందిన మూడె రెడ్డినాయక్‌‌తో సాలిబాయికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సాలిబాయి ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా భర్తను హతమార్చేందుకు వినోద్ కుమార్ నాయక్, విజయ్‌కుమార్, మునగపాటి జగన్నాథరాజులతో కలిసి లక్ష రూపాయలకు సుపారి కుదుర్చుకుని రూ.30 వేలను అడ్వాన్స్‌గా చెల్లించింది. 
 
ప్రణాళికలో భాగంగా సాలిబాయికి ఇవ్వాల్సిన రూ.10 వేలు ఇస్తానని, వచ్చి తీసుకెళ్లాల్సిందిగా ఆమె భర్త తులసీనాయక్‌ను రెడ్డినాయక్ చింతకుంట పిలిపించాడు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం మద్యం బాటిల్‌తో తులసీనాయక్‌పై దాడిచేశారు. తేరుకున్న తులసీనాయక్ పారిపోయేందుకు ప్రయత్నించగా, తమ వద్ద ఉన్న స్కార్పియో వాహనంతో తొక్కించి చంపారు. అనంతరం శవాన్ని తీసుకెళ్లి  దువ్వూరు మండలం పెద్దజొన్నవరం మిట్ట వద్ద కల్వర్టు పక్కన పడేశారు.
 
కేసును తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో తన భర్త మరణానికి గ్రామానికి చెందిన దమన పెద్ద పుల్లయ్య కారణమని సాలిబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆమె ప్రవర్తనలో అనుమానాన్ని గమనించిన పోలీసులు ఆమె కాల్‌డేటాను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఆమె రోజూ రెడ్డి నాయక్‌తో మాట్లాడుతున్నట్టు తేలడంతో తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో సాలిబాయి హత్యను తానే చేయించినట్టు అంగీకరించింది. నిన్న ఆమెతో పాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments