Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ముసుగు దొంగలు.. వ్యాపారి ఇంట్లో చొరబడి మహిళను చంపేశారు..!

సెల్వి
శుక్రవారం, 19 జులై 2024 (10:30 IST)
తిరుపతిలో ముసుగు యువకుల దాడిలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాయల్ నగర్‌లో గురువారం వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లోకి వృద్ధురాలు, బాలిక మినహా కుటుంబ సభ్యులందరూ లేని సమయంలో ముసుగు ధరించిన యువకుడు చొరబడ్డాడు. 
 
ఇంట్లో ఉన్న మహిళ, బాలికపై దాడి చేశాడు. కత్తి దాడిలో 75 ఏళ్ల జయలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక నియాతి (12) తీవ్రంగా గాయపడగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
దాడి చేసిన వ్యక్తి ఒంటరిగా వచ్చాడా లేక ఇతరులతో వచ్చాడా అనేది తెలియరాలేదు. రెండేళ్ల క్రితం ఈ వ్యాపారి కుటుంబ సభ్యులపై కూడా ఇదే తరహాలో కత్తి దాడి జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. 
 
పోలీసు సిబ్బందితో కలిసి ఎస్పీ ఇంటిని పరిశీలించారు. ఇప్పటికే వరకు చిక్కిన ఆధారాల ఆధారంగా దుండగుడిని పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments