Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక అక్రమ సంబంధానికి దూరం.. ఆమెను హత్య చేసిన దంపతులు?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (09:54 IST)
అక్రమ సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. తాజాగా ఆర్థిక అవసరాల కోసం బరితెగించి దంపతులిద్దరు అమాయక మహిళను హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ కేసులో పోలీసులు హత్య చేసి కట్టు కథ అళ్లిన దంపతులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ జీడిమెట్లలోని వినాయక నగర్‌లో ఝార్ఖండ్‌కు చెందిన రాజేశ్ వర్మ అనే యువకుడు గత అయిదు సంవత్సరాలుగా ఉంటున్నాడు.
 
 కాగా అదే కాంప్లెక్స్‌లోనే పక్కన సంజీత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కాగా సంజీత్ నగరంలో ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. అవసరాలకు అప్పులు చేస్తూ జులాయిగా మారాడు. దీంతో ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఇంటిని పట్టించుకోకుండా సంజీత్ వ్యవహరించాడు.
 
దీంతో సంజీత్ భార్య తన అవసరాల కోసం పక్కనే ఉంటున్న రాజేశ్ వర్మతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వారికి కావాల్సిన కుటుంబ అవసరాలను రాజేశ్ వర్మ తీరుస్తు ఉండేవాడు... అయితే గత ఆరు నెలల క్రితమే రాజేశ్ వర్మ జార్ఖండ్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్‌ నుండి హైదరాబాద్‌లోనే కాపురం పెట్టాడు. దీంతో.. పెళ్లి తర్వాత తన అక్రమ సంబంధానికి పుల్‌స్టాప్ పెట్టాడు. పక్కింటి సంజీత్ భార్యతో దూరంగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే రాజేశ్ అక్రమ సంబంధంతో పాటు సంజీత్ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు రాలేదు.
 
దీంతో రాజేశ్ వర్మకు భార్య రావడంతో తమకు ఆర్ధిక కష్టాలు వచ్చాయని సంజీత్ దంపతులు భావించారు. దీంతో ఆమెను కడతేర్చడం ద్వారా రాజేశ్‌ను తిరిగి దారిలోకి తెచ్చుకోవచ్చనే కుట్రకు తెరలేపారు. దీంతో నాలుగు రోజుల క్రితం రాజేష్ వర్మ ఉద్యోగానికి వెళ్లడంతో ఒంటరిగా నిద్రపోతున్న ఆయన భార్య ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
 
అనంతరం పోలీసులు రావడంతో కట్టుకథ చెప్పారు.. ఆమె ప్రియుడితో గొడవ పడిందని పోలీసులకు వివరించారు. ప్రియుడు రమ్మని చెప్పడంతో నిరాకరించిన ఆమెను హత్య చేశాడని వివరించారు. దీంతో సంజీత్ దంపతులు చెప్పిన స్టోరీపై అనుమానాలు వ్యక్తం చేసిన జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేపట్టారు. అయితే ఆ కెమెరాల్లో ఎవరు రాకపోవడంతో సాక్ష్యాలు సేకరించారు.దీంతో సంజీత్ దంపతులను తమ స్టైల్లో విచారించాడంతో అసలు విషయం ఒప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments