Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్‌టీపీ ప్ర‌క‌టించి వంద రోజులు... ఇడుపులపాయకు షర్మిల

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (09:52 IST)
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం ఇడుపులపాయకు వ‌స్తున్నారు. వైఎస్సార్‌టీపీని అధికారికంగా ప్రకటించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 20వ తేదీన చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్రకు వైఎస్‌ షర్మిల శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.

వైఎస్‌ షర్మిలతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా రానున్నారు. మంగళవారం ఉదయం కడప విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకుంటారు. తండ్రి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయ నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
 
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పార్టీని ప్ర‌క‌టించి వంద రోజులు అయినా, ఇంకా ఆ పార్టీ ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉంది. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌లు, ప్రెస్ మీట్లు... చిన్న చిన్న నిరాహార దీక్ష‌లు మిన‌హా పార్టీలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది. ఈ ద‌శ‌లో ష‌ర్మిల చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్ర ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments