Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు మహా పాదయాత్ర: ఒకవైపు హెచ్చరికలు మరోవైపు స్వాగతం

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (20:34 IST)
అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టి 43 రోజులవుతోంది. ఇక మిగిలింది రెండురోజులు మాత్రమే. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ పాదయాత్రను ప్రారంభించి నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు. అయితే తిరుపతిలో పాదయాత్రను అడుగుపెట్టనీయము.. అడ్డుకుంటామంటూ రకరకాల హెచ్చరికలు జారీ చేశారు.

 
అయితే ఎలాంటి హడావిడి లేకుండా పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. ప్రస్తుతం రామానాయుడు కళ్యాణ మండపం వద్ద అమరావతి రైతులు సేద తీరుతున్నారు. అయితే అమరావతి రైతులను హెచ్చరిస్తూ.. వారికి స్వాగతం పలుకుతూ కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి.

 
మీతో మాకు గొడవలు వద్దు.. మాకు మూడు రాజధానులు కావాలంటూ.. మీకు తిరుపతికి స్వాగతమంటూ అమరావతి రైతులను ఒకవైపు హెచ్చరిస్తూ.. మరోవైపు స్వాగతం పలుకుతూ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. 

 
నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదేవిధంగా వైసిపి నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేశారు. దీన్ని చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. ఎవరో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలు అంటూ రాయడంపై ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 
 
ఇదంతా అధికార పార్టీ నేతల పనేనంటూ అమరావతి రైతులు చెబుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments