Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య కారును ఆపిన వైసీపీ కార్యకర్త... ప్లకార్డు పట్టుకుని?

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (22:49 IST)
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఆయన ప్రయాణిస్తుండగా వైసీపీ కార్యకర్త కారును ఆపాడు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు అశ్వర్థారెడ్డి కుమార్తె వివాహానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. 
 
అనంతరం తిరిగి వస్తుండగా బాలకృష్ణ కారును వైసీపీ కార్యకర్త మధు అడ్డుకున్నాడు. చేతిలో ప్లకార్డుతో వాహనాన్ని అడ్డుకోబోయాడు. ప్లకార్డును కారుపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వైసీసీ కార్యకర్త మధును అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
 
ఈ క్రమంలో ప్లకార్డు కర్ర ఈఎస్‌ఐకి తగిలింది. పోలీసులు మధును పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు. అనంతరం బాలకృష్ణ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
 
మరోవైపు హిందూపురం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అశ్వర్థారెడ్డి కుమార్తె వివాహానికి బాలకృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అక్కడ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
 
 
 
మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బీకే పార్థసారథి కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments