Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడని పగ, రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో...

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:36 IST)
వివాహేతర సంబంధాలు కుటుంబాలను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. పగ, ప్రతీకారాలతో హత్యలు చేసుకునే వరుకు వెళుతున్నాయి. వివాహేతర సంబంధాలు వద్దంటూ మహిళా సంఘాలు చెబుతున్నా కొంతమందిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.
 
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెం ప్రాంతానికి చెందిన షేక్ సుబానీ అదే ప్రాంతానికి చెందిన మున్నీసా అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకి ఇంకా వివాహం కాలేదు. అయితే అతనితో కలిసి ఉండడమే కాకుండా గోపి అనే మరో యువకుడికి ఆమె దగ్గరైంది.
 
ఆ యువతి అడిగినవన్నీ కొనిస్తూ ఆమెకు బాగా దగ్గరయ్యాడు గోపి. దీంతో షేక్ సుబానీని పక్కన పెట్టేసింది మున్నీసా. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు సుబానీ. గోపినే ఇందుకు కారణమని భావించాడు. అతన్ని చంపేయాలనుకున్నాడు. ఇంటి బయట నిద్రిస్తున్న గోపిపై కత్తితో దాడి చేశాడు షేక్ సుబానీ. తీవ్రగాయాల పాలైన గోపి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments