అసెంబ్లీకి జగన్ వచ్చారు.. వెళ్లారు.. మరో 3 నెలలు సభ్యత్వం సేఫ్!!

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (12:33 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజున వైకాపా అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభకు వచ్చారు. సభలోకి అడుగుపెట్టే ముందు అసెంబ్లీ హాజరుపట్టికలో వారు సంతకం చేశారు. అంటే సభకు వచ్చినట్టుగా హాజరు వేయించుకున్నారు. దీంతో మరో 60 రోజుల పాటు వారు సభకు రాకుండానే కాలం గడిపేయవచ్చు. 
 
సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు జగన్ తన పరివారంతో సభకు హాజరుకావడంతో మరో 60 రోజుల వరకు అటువైపు కన్నెత్తి చూడాల్సిన పరిస్థితి ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న భయంతోనే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సభకు వచ్చారని టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, సభకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం 11 నిమిషాల్లోనే సభ నుంచి వాకౌట్ అయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగానే తన సభ్యులతో కలిసి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అది సాధ్యపడకపోవడంతో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments