Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి!

Webdunia
గురువారం, 7 జులై 2022 (14:47 IST)
వైకాపా ప్లీనరీ సమావేశాలు త్వరలో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్. జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలంతా కలిసి ఎన్నుకోనున్నారు. ఇందుకోసం వైకాపా పార్టీ నియమావళిని సవరించేలా ఒక తీర్మానం చేయనున్నారు. అలాగే, పార్టీ శాశ్వత గౌరవాధ్యక్షురాలిగా జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కొనసాగేలా తీర్మానం చేయనున్నారు. 
 
అయితే, జగన్, విజయమ్మ, షర్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆస్తి పంపకాల్లో తలెత్తిన మనస్పర్థల కారణంగా విజయమ్మ తన కుమార్తె షర్మిలవైపు మొగ్గు చూపారు. దీంతో గత కొంతకాలంగా ఆమె జగన్‌తో పాటు వైకాపాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా ప్లీనరీ సమావేశాలకు వస్తారా? లేదా? అన్నది తెలియాల్సివుంది. 
 
మరోవైపు, త్వరలో జరిగే ప్లీనరీ తర్వాత ఇక 2027లో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు మరో సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా చెబుతున్నారు. అంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్లీనరీ సమావేశాలు నిర్వహించేలా పార్టీ నియమావళిని సవరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments