Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పార్టీ పెట్టడం లేదు, ఎందుకీ నీతిమాలిన చర్య: వైఎస్ షర్మిళ ఆగ్రహం

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (22:52 IST)
అన్నకు పోటీగా చెల్లెలు పార్టీ పెడుతోంది. ఆమె పార్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకుంది. త్వరలోనే పార్టీ పెడుతుంది. జనంలోకి వెళుతుంది. పాదయాత్ర చేపడుతుంది. ప్రజలను తనవైపు తిప్పుకుంటుంది. తన తండ్రి రాష్ట్రానికి చేసిన సేవను ప్రజల్లోకి తీసుకెళుతూ యాత్ర సాగుతుంది.
 
ఇదంతా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చర్చ. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ అన్న, చెల్లెల్లు ఎవరో.. వై.ఎస్.జగన్, షర్మిళ. అన్నతో పొసగక చెల్లెలు షర్మిళ సొంత పార్టీవైపు మ్రొగ్గు చూపుతోందని ప్రచారం జరిగింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేసుకుందంటూ ప్రచారం జరిగింది.
 
ఇక మిగిలింది కొత్త పార్టీతో రంగప్రవేశమే అంటూ ఊదరగొట్టారు. కానీ దీనిపై ఆలస్యంగా స్పందించారు షర్మిళ. కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ పత్రిక అయినా ఏ ఛానల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము అంటూ ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments