Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (19:55 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిలుపై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో వివేకా కుమార్తె సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను ఏమైనా చేస్తారనే భయం తమలో ఉందని చెప్పారు. ఇటీవల తనకు కొన్ని విషయాలు తెలిశాయని, అవి తనను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు. 
 
అవిశాన్ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పలు విషయాలను పేర్కొందని తెలిపారు. విచారణ అధికారులను అవినాశ్ పిలిపించుకుని బెదిరించినట్టు అందులో పేర్కొన్నారని, తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాశ్ సంతకాలు చేయించినట్టు ఉందని చెప్పారు. 
 
అవినాశ్ బెయిల్‌పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని అన్నారు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించినట్టు తప్పుడు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హత్య జరిగినపుడు ఘటనాస్థలిలో ఉన్నది అవిశాన్ రెడ్డేనని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments