Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినాష్ రెడ్డి బీజేపీలో చేరుతారు.. సీబీఐకీ ఇస్తే 11కేసులకుతోడు 12 కేసులు అవుతాయి..

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:12 IST)
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన నిందితులకు శిక్షపడేందుకు శాయశక్తులా పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ సంచలన వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
కేసును సీబీఐకు అప్పగిస్తే వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడని సీఎం జగన్ అన్నట్టు సునీత స్టేట్మెంట్‌లో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, వైఎస్ అవినాష్‌పై 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుందని జగనన్న అన్నారని సీబీఐకు ఆమె వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న గంగాధర్ రెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె సునీతనే తనను ప్రలోభాలకు గురిచేసిందని చెప్పినట్టు ఓ వార్తా కథనాన్ని జగన్ మీడియా ప్రచురించడం గమనార్హం. 
 
కాగా, తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తున్నారు. గత 2020 జూలై 7వ తేదీన సీబీఐ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం‌ ఇదేనంటూ మీడియాలో రిపోర్టులు కూడా వచ్చాయి. ఆ స్టేట్మెంట్‌లో సునీత అనేక సంచలన విషయాలను వెల్లడించారు. 
 
"మా నాన్నను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలా మందికి తెలుసు. హంతకులెవ్వరో తేల్చాలని అన్నను కోరా. అనుమానితుల పేర్లు కూడా చెప్పా. వాళ్ళను ఎందుకు అనుమానిస్తున్నావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు. అయితే సీబీఐతో విచారణ చేయించాలని సవాల్ చేశాను. సీబీఐకు ఇస్తే ఏమవుతుంది. అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరుతారు. అతడికేమీ కాదు. 11 కేసులకు మరొకటి తోడై పన్నెండు కేసులు అవుతాయ్ అంటూ జగన్ మాట్లాడినట్టు సునీత వెల్లడించినట్టు మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments