Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొడగొట్టి చెబుతున్నా... 2024లో ఎంపీ సీట్లన్నీ మావే : విజయసాయిరెడ్డి

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (15:11 IST)
వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లు, 25 సీట్లను గెలుచుకుంటామని రాజ్యసభలో వైకాపా నేత విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 25 ఎంపీ సీట్లకు గాను ఏకంగా 22 సీట్లను కైవసం చేసుకోవడం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఘనవిజయానికి నిదర్శమన్నారు. ఇపుడు తొడగొట్టి చెబుతున్నాం... వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో 25కు 25 లోక్‌సభ సీట్లను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న పాలన ప్రారంభమైందనీ, సీఎం జగన్ అవినీతిరహిత పాలన అందిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజారంజక పాలన అందించేలా జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయన్నారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్లమెంటులో వైసీపీ సభ్యులు నడుచుకుంటారని ఆయన తెలిపారు.
 
కాగా, ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైకాపా 151 శాసనసభ సీట్లను, 25 ఎంపీ సీట్లకు గాను 22 ఎంపీ సీట్లను గెలుచుకున్న అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments