Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ ఇపుడు నిజంగానే చనిపోయారు : సీపీఐ రామకృష్ణ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:42 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగా ఇపుడు చనిపోయారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తమ కుటుంబ పరువును బజారులో పడేసిన కుటుంబ సభ్యులను చూసి వైఎస్ఆర్ ఆత్మ ఘోషించివుంటుందని చెప్పారు. 
 
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తెలంగాణాలో పోలీసులపై చేయిచేసుకున్న కేసులో వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల, ఆమెను చూసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విజయమ్మ ఇలా అందరూ ఒకే రోజున టీవీల్లో కనిపించారని గుర్తుచేశారు. దీంతో వైఎస్ఆర్ కుటుంబ పరువు పోయిందన్నారు. 
 
ఇవన్ని చూసి వైఎస్ఆర్ నిజంగా ఇపుడు చనిపోయి వుంటారని అన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఒక్క మనశ్శాంతి మినహా మిగిలిన అన్నీ ఉన్నాయని తెలిపారు. వివేకా హత్య కేసు విచారణ గత నాలుగేళ్లుగా సాగుతోందని, ఇది మరో యేడాది పాటు సాగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. 
 
తెలంగాణాలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఇది దళితులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకే అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేశారన ఆయన ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments