Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ చెంతకు చేరిన వైకాపా నేత శివరామిరెడ్డి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (17:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఇప్పటినుంచే అన్ని రాజకీయ పార్టీల నేతలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ లభించదని గట్టిగా భావించిన వారు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమైపోతున్నారు. అలాంటి వారిలో వైకాపా నేతలే అధికంగా ఉన్నారు. వీరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన వైకాపా నేత ఉయ్యూరు శివరామిరెడ్డి పవన్ సొంత పార్టీకి రాంరాం పలికారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ, జనసేన పార్టీలో చేరడం తనకు ఎంతో ఇష్టంగా ఉందని తెలిపారు. 
 
కాగా, ఉయ్యూరు శివరామిరెడ్డి 1987లో తెలుగుదేశం పార్టీలో చేరి మూడేళ్ళపాటు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించడంతో ఆయన వంచన చేరి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడయ్యారు. 
 
2012లో వైసీపీలో చేరారు. జగన్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెంది పవన్‌ కల్యాణ్‌ వెంట నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు శివరామిరెడ్డి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments