Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్ర‌మాదానికి వైసీపీ వారే కార‌ణం; రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేత‌లు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:44 IST)
గుమ్మగట్ట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం, కేవ‌లం వైసీపీ కార్య‌క‌ర్త‌ల వ‌ల‌నే జ‌రిగింద‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా, కళ్యాణ దుర్గం నియోజకవర్గం, బ్రహ్మ సముద్రం మండలం, ముప్పులకుంట, కోడిపల్లి గ్రామాలకు చెందిన, ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు స‌హా, రాయదుర్గం ప్రాంతానికి చెందిన మ‌రో మ‌గ్గురు ఈ ప్ర‌మాదంలో మృత్యువాత పడ్డారు. 
 
 
వైసీపీ వారు కావాల‌నే వాహ‌నంతో ఢీకొట్టార‌ని, ప్ర‌మాదానికి కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని రాయదుర్గంలో అనంత పార్లమెంట్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు డిమాండు చేశారు. ఆయ‌న‌తో పాటు ఆందోళనలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ  చైర్మన్ దొడగట్ట నారాయణ, పట్టణ కన్వీనర్ మురళి, బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, పార్లమెంట్ కమిటీ టీడీపీ కార్యదర్శి తలారి సత్తి, మాజీ మండల కన్వీనర్ మంజు, శివ, మాజీ ఎంపీటీసీ రవి, మాజీ సర్పంచ్ బసవరాజు తదితరులు రోడ్డుపై బైఠాయించి త‌మ నిర‌స‌న తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments