Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక నుంచి తైలం తీసే తెలివి జగన్‌కు లేదు : విజయసాయిరెడ్డి

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (18:15 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇసుక నుంచి తైలం తీసే మీ తెలివి మా పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేవంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'కరెంటు బిల్లులపై పచ్చ పార్టీ దీక్షలను చూసి దేశమంతా నవ్వుతోంది. జాతీయ మీడియా, సోషల్ మీడియాలు వాటిని దీక్షలు అనలేమని తేల్చాయి. ఏసీ గదుల్లో కూర్చుని నిరసన కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటే, ప్రజల కోసంకాకుండా ఎల్లో మీడియా కవరేజి కోసం తాపత్రయపడినట్టు కనిపిస్తోందని' అంటూ విజయసాటి రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, "కరెంటు గురించి జగన్‌గారికి అస్సలు అవగాహన లేదట. లక్ష కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారే, ఆ స్థాయి మేధస్సు నిజంగానే జగన్‌గారికి లేదు. పైగా ఒప్పందాలను రద్దు చేయాలంటున్నాడు. ఇసుక నుంచి తైలం తీసే మీతెలివి ఆయనకెక్కడిది'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ల రూపంలో విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments