Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ ఆర్‌పై వేటు వేయండి : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైకాపా లేఖ

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (21:51 IST)
ఏపీలోని అధికార పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వైకాపా నేతలు లేఖ రాశారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గతంలోనే వైసీపీ ఎంపీలు ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఇదే అంశాన్ని వారు మరోసారి లేవనెత్తారు. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని గత ఏడాది జులై 3న తమకు ఫిర్యాదు చేశామని... అయితే అకారణంగా ఈ విషయంలో జాప్యం చేస్తున్నారంటూ లేఖలో వారు పేర్కొన్నారు. 
 
పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈ లేఖపై ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 
 
మరోవైపు, తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించాలని స్పీకర్‌కు రఘురామరాజు ఇప్పటికే లేఖ రాశారు. తాను యువజన శ్రామిక రైతు పార్టీ తరపున గెలిచానని, ఎక్కడా కూడా పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించలేని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments