Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకునే వారు.. జీరా నీరు తాగితే..?

బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం లేదా..? ఐతే ఇక జీరాను అదేనండి జీలకర్రను నమ్ముకోండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ప్రతిరోజూ ఏదో రూపంలో జీరాను ఆహారంలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చునని

Webdunia
బుధవారం, 18 జులై 2018 (10:58 IST)
బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం లేదా..? ఐతే ఇక జీరాను అదేనండి జీలకర్రను నమ్ముకోండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ప్రతిరోజూ ఏదో రూపంలో జీరాను ఆహారంలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
జీలకర్రలో మాంగనీస్‌, ఐరన్‌, పొటాషియం, ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. అధిక ప్రోటీన్లున్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటితో జీరా కూడా జతకలిస్తే.. ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. జీర్ణప్రక్రియ సరిగా ఉంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులుండవు. అందుకు జీరా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి కొవ్వు నియంత్రణలో ఉంటుంది. జీరాలోని ఫైబర్ కణాల కదలికకు తోడ్పడుతుంది. 
 
శరీరంలో నీరు వుంటే ఊబకాయం తప్పదు. అలాంటి తరుణంలో జీరా నీటిని సేవించడం చేయాలి. జీరాలో థైమోల్‌ అనే కాంపౌండ్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుచేత ఒక గ్లాసు నీటిలో జీరా ఓ స్పూన్ చేర్చి ఆ నీటిని అరగంట తర్వాత తాగితే మంచి ఫలితం వుంటుంది. అలాగే జీలకర్ర రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. 
 
బరువు తగ్గాలనుకునేవారు సాధారణంగా తీసుకునే నీటిలో జీరాను కలిపి తీసుకోవాలి. ఒక స్పూను జీరాను గ్లాసు నీటిలో ఉడికించాలి. గ్లాసు నీళ్లు అరగ్లాసు అయ్యేదాకా ఉడికించవచ్చు. ఆ నీటిని ఉదయమే తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం ఆ నీటిలో కాస్త తేనె కూడా కలపొచ్చు.

చల్లటి మజ్జిగపై జీరా పొడిని చిలకరించి తాగొచ్చు. భోజనంలో తీసుకునే పెరుగులో వేగించిన జీలకర్రను చల్లి తినొచ్చు. పిండిలో జీలకర్ర పొడిని కలిపి చేసిన చపాతీలు కూడా ఆరోగ్యకరమనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments