Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగితే? (video)

నేరేడు ఆకుల కషాయంతో బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. నేరేడు ఆకులను మెత్తగా నూరి రోజుకు అర స్పూన్ తీసుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే నేరేడు పండ్లను ఊబకాయులు, మధుమ

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (11:35 IST)
నేరేడు ఆకుల కషాయంతో బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. నేరేడు ఆకులను మెత్తగా నూరి రోజుకు అర స్పూన్ తీసుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే నేరేడు పండ్లను ఊబకాయులు, మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 
 
మధుమేహులు నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. నేరేడు పండ్లు తింటే కాలేయ సంబంధిత సమస్యలు తొలగిపోయి కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అజీర్తితో ఇబ్బంది ఏర్పడితే నాలుగు పండిన నేరేడు పండ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. 
 
నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండె ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయి. రక్తక్యాన్సర్‌ కారకాలను కూడా నిరోధిస్తాయి. అధిక జ్వర బాధితులు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే.. నిమ్మ, నేరేడు రసాన్ని రెండేసి చెంచాల చొప్పున నీటిలో కలిపి తీసుకుంటే ఉపశమనం వుంటుంది.  
 
నేరేడు ఆకుల కషాయంతో నోరు పుక్కిలిస్తే పంటినొప్పి, చిగురువాపు, నోట్లో పుండ్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. నెలసరి సమస్యలున్నవారు నేరేడు బెరడు కషాయాన్ని నెలరోజులు ఓ స్పూన్ మోతాదులో రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

తర్వాతి కథనం
Show comments