శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి...?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (12:03 IST)
మనిషిని చూడగానే ఆకట్టుకునేది ముఖమే. అలాంటి ముఖచర్మం అందంగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు బ్యూటీ నిపుణులు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఈ కింది చిట్కాలు ఎంతగానో సహాయపడుతాయి. మరి అవేంటో చూద్దాం..
 
1. శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖ చర్మంపై టాన్‌పోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
2. ఉల్లిరసంలో స్పూన్ ముల్తానీమట్టి, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దాంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
 
3. నిమ్మరసంలో ఆల్మండ్ ఆయిల్, సముద్రపు ఉప్పును కలిపి అందులో దూదిని ముంచి ముఖంపై గుండ్రంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మంపై మృతకణాలు పోతాయి. దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
4. టమోటాలోని యాంటీఆక్సిడెంట్స్ గుణాలు ముడతల చర్మాన్ని తొలగిస్తాయి. రెండుపెద్ద టమోటాలను మెత్తటి గుజ్జులా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు పడవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ వంటగది వీడియోలో తప్పు లేనప్పుడు నా కేక్ కటింగులో తప్పు లేదే: దువ్వాడ శ్రీనివాస్

మధ్యాహ్న భోజన పథకం: వారానికి ఒకసారి చికెన్ స్థానంలో చేపలు

మద్యం మత్తులో సోదరుల మధ్య గొడవ.. హత్యకు దారి తీసింది.. ఎలా?

కూకట్‌పల్లిలో వ్యభిచారం.. రెండు వేర్వేరు ఇళ్లపై దాడి- ఐదుగురు అరెస్ట్

తెలంగాణలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు.. శుక్రవారం 40డిగ్రీల సెల్సియస్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Shankar :ఉగాదికి రావాలని వారి కోరిక మేరకు వస్తున్నాం ఆశీర్వదించండి: హరీశ్ శంకర్

Ramcharan: పవన్ కళ్యాత్ తో చిరంజీవి, రామ్ చరణ్ మనోహరమైన దృశ్యం!

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (TGFA) లకు ఎంపికైన చిరంజీవి, నాగచైతన్య, రష్మిక మందన్నా

కేక్ కట్ చేయకూడదని మాకు తెలియదు... ఎగ్ లెస్ కేకే కట్ చేశాం.. దువ్వాడ శ్రీనివాస్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

తర్వాతి కథనం
Show comments