Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాలకు ఉల్లిపాయ రసాన్ని రాస్తే ఏమవుతుంది..?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (11:35 IST)
నేటి తరుణంలో చాలామందికి పాదాలు పగుళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ పగుళ్లను తొలగించుకోవడానికి ఏవేవో మందులు, మాత్రలు వాడుతుంటారు. అయితే వీటి వాడకం అంత మంచిదికాదని చెప్తున్నారు బ్యూటీ నిపుణులు. మరి ఈ పగుళ్లు ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తున్నారా.. ఈ చిట్కాలు పాటించండి.. చాలు..
 
1. బ్యూటీపార్లర్ డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌లలో లభించే కాస్మెటిక్స్ వాష్ తీసుకోవాలి. ఇప్పుడు ఆవనూనెను వేడిచేసి అందులో కొన్ని మిరియాలు వేసి బాగా వేయించిన తరువాత అందులో ఈ వాష్‌ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ప్రతిరోజూ పాదాలకు రాసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే పాదాలు మృదువుగా మారుతాయి.
 
2. పాదాల్లో దురదతో బాధపడేవారు.. పెద్ద ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మెత్తని పేస్ట్‌లా చేసి దాని రసాన్ని తీసి పాదాలకు పూతలా పట్టించాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత పాదాలను 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే.. పాదాలు పగుళ్లు పోతాయి.
 
3. పావుకప్పు పెరుగులో స్పూన్ నిమ్మరసం కలిపి కాళ్లు, పాదాలు, చేతులకు రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
 
4. అలానే ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత కొబ్బరి నూనెను పాదాలకు రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పాదాలు పగుళ్లు పోయి.. మృదువుగా మారుతాయి.
 
5. శుభ్రమైన దీపపు నూనెలో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు పాదాలకు పట్టించాలి. ఉదయాన్నే నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే పాదాలు పగుళ్లు రావు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments