మెడపై చర్మానికి ఆ నూనెతో మర్దన చేస్తే...?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (12:59 IST)
4
అందంగా, మృదువుగా కనిపించే మెడ భాగాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మెడ మీద చర్మం సున్నితంగా ఉంటుంది.. కాబట్టి బరబరా రుద్ది శుభ్రం చేయకూడదు. జుట్టు నుండి మెడకు అంటుకునే జిడ్డును తొలగించేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
 
మెడ భాగానికి ఆలివ్ నూనెను రాసి మర్దన చేయడం వలన ఆ ప్రాంతమంతా మృదువుగా ఉంటుంది. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందుగా ఆలివ్ నూనెను రాసుకుని ఉదయాన్నే లేవగానే వేనీళ్ళతో శుభ్రం చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
 
ఎక్కడికైనా బయటకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు వెంటనే గోరువెచ్చని నీటిలో ముఖాన్ని, మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. గిల్ట్ నగలు వేసుకోవడం వలన మెడభాగంలో నల్లటి మచ్చలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నల్ల మచ్చల కారణంగా దురదలు కూడా వస్తాయి. కాబట్టి గిల్ట్ నగలు ధరించడం మానేయండి.
 
రోజుకు కనీసం రెండుసార్లు 3 లేదా 4 నిమిషాల పాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు రాసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మెడ మెరిసిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments