ఆవనూనెతో దోసగింజల పొడిని కలిపి పాదాలకు రాసుకుంటే?

దోసపండు, దోసకాయలో సౌందర్య పోషణకు తగినన్ని గుణాలున్నాయి. దోసపళ్ల రసం, కీరదోస రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే దోసగింజలను ఎండబెట్టి పొడి చేసుకుని.. అందుకు ఓట్స్ పొడిని కాస్త

Webdunia
శనివారం, 1 జులై 2017 (13:21 IST)
దోసపండు, దోసకాయలో సౌందర్య పోషణకు తగినన్ని గుణాలున్నాయి. దోసపళ్ల రసం, కీరదోస రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే దోసగింజలను ఎండబెట్టి పొడి చేసుకుని.. అందుకు ఓట్స్ పొడిని కాస్త కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం సౌందర్యం పెంపొందుతుంది.
 
ముఖం డల్‌గా కనిపిస్తే.. దోసపండు ముక్కను ముద్ద చేసుకుని.. ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. ఆరిపోయాక కడిగేస్తే ముఖం కాంతివంతమవుతుంది. దోసగింజల పొడి ముఖ సౌందర్యానికే కాకుండా పొడి జుట్టుకు చక్కని కండిషనర్‌గా పనిచేస్తుంది. ఆవనూనెతో దోసగింజల పొడిని కలిపి పాదాలకు రాసుకుంటే.. పాదాలు దూదిలా మెత్తబడతాయి.
 
ఇక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రభావం కళ్ళ చుట్టూ ఉండే చర్మంపై కూడా పడుతుంది. అందుచేత కంటి కిందటి వలయాలను దూరం చేసుకోవాలంటే.. పాల పొడి, దోసగింజల పొడి సమానంగా తీసుకుని, నీటిలో కలిపి, కళ్ల చుట్టూ పూసుకోవాలి. ఐదు నిమిషాల తరువాత కడిగేయాలి. కళ్ల చుట్టూ ఉండే ముడతలు, నల్లని వలయాలు, అలసటా పోయి, కళ్లు ప్రకాశవంతంగా తయారవుతాయని బ్యూటీషన్లు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బిల్ గేట్స్ ఏపీ పర్యటన.. చాయ్, సమోసా ట్రీట్ వరకే.. వైకాపా ధ్వజం

నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య - సీఎం చంద్రబాబు ఫోనులో పరామర్శ

ఇద్దరు విద్యార్థులతో లైంగిక సంబంధం పెట్టుకున్న హైస్కూల్ ఉద్యోగిని

నన్ను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తావా? మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments