పాదాల పగుళ్లకు.. నువ్వుల నూనె రాసుకుంటే..?

నీళ్లల్లో ఎక్కువగా పనిచేసే వారిలో అరిచేతులు, పాదాలు పాచినట్లువుతాయి. అంతేకాకుండా పాదాలు పగుళ్లు, పాచినట్లు ఉంటాయి. ఈ ప్రాంతాలలో సబ్బులు, వంటసోడా తగిలినా కూడా ఈ సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా సబ్బు నీటి

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:03 IST)
4
నీళ్లల్లో ఎక్కువగా పనిచేసే వారిలో అరిచేతులు, పాదాలు పాచినట్లువుతాయి. అంతేకాకుండా పాదాలు పగుళ్లు, పాచినట్లు ఉంటాయి. ఈ ప్రాంతాలలో సబ్బులు, వంటసోడా తగిలినా కూడా ఈ సమస్యలు అధికమవుతాయి. ముఖ్యంగా సబ్బు నీటిలో ఎక్కువగా ఉంటే పాదాలు పగుళ్ల నుండి రక్తం, చీము కారుతుంది. దాంతో పాదాలు దురదలుగా ఉంటాయి. ఈ సమస్యలు తొలిగిపోవాలంటే ఇలా చేస్తే చాలు..
 
నీటిలో పనిచేసిన తరువాత పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మెత్తటి గుడ్డతో తడిని పూర్తిగా తుడుచుకుని పాదాలకు ఆముదం లేదా నువ్వులనూనెను రాసుకుని మర్దన చేసుకోవాలి. అలానే వేపాకులను నీటిలో మరిగించుకుని ఆ నీళ్లల్లో పాదాలను 10 నిమిషాల పాటు ఉంచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
మాను పసుపును కషాయంగా చేసుకుని ప్రతిరోజూ రెండుపూటలా తీసుకుంటే పాదాలను ఇన్ఫెక్షన్స్ రావు. అలాకాకుంటే పసుపుని గంధంలా చేసుకుని పాదాలను రాసుకుంటే కూడా మంచిదే. నెయ్యి ఆరోగ్యానికి కాదు పలురకాల ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. అంటే నెయ్యిలో కొద్దిగా తేనె కలుపుకుని పాదాలకు పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకుంటే మంచిది.
 
నువ్వుల నూనెను వేడిచేసుకుని కొద్దిగా తేనె, మైనం ముక్కలు వేసి కరిగించుకోవాలి. కాసేపటి తరువాత దించుకుని పాదాలకు, అరచేతులకు రాసుకుని గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన పాదాలు, అరిచేతులు ఆరోగ్యంగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే : అంబటి సతీమణి పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్

ఆవుపై అత్యాచారం.. వీడియో వైరల్... స్థానికుల విధ్వంసం

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments