Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాదుంప ముక్కలు కళ్ల మీద పెట్టుకుంటే?

బంగాళాదుంపల్ని మెత్తగా చేసి దాని రసాన్ని తీసుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా కూడా మంచిది. చర్మం కమిలిపోయిన చోట దీనిని రాసుకుంటే

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (15:41 IST)
బంగాళాదుంపల్ని మెత్తగా చేసి దాని రసాన్ని తీసుకోవాలి. దాంతో తరచూ ముఖం కడుక్కుంటే కళతప్పి నిర్జీవంగా మారిన చర్మం మెరిసిపోతుంది. వీలైతే ప్రతిరోజూ చేసినా కూడా మంచిది. చర్మం కమిలిపోయిన చోట దీనిని రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. రెండు చెంచాల బంగాళాదుంప రసంలో చెంచా నిమ్మరసం కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటకు తీశాక దూదితో ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. మెుటిమలు, మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు దూరమవుతాయి.
 
ముల్తానీ మట్టిలో చెంచా బంగాళాదుంప గుజ్జ, నాలుగు చుక్కల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి.  బంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. అందులో కొంచెం పాలపొడి, బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవాలి. 
 
తరచుగా ఇలా చేయడం వలన పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. కళ్ల కింద నల్లమచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంప ముక్కలు తరిగి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపటి తరువాత కొన్ని నిమిషాల పాటు కళ్ల మీద పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తుంటే క్రమంగా నల్లటిమచ్చలు తగ్గుముఖం పడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments