ఉల్లిరసంలో కొంచెం తేనె కలిపి రాసుకుని...

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (21:51 IST)
టీనేజ్ అమ్మాయిలను సౌందర్యపరంగా బాధించే సమస్యల్లో మొటిమలు సమస్య ఒకటి. వాటివల్ల భరించలేని నొప్పితో పాటు.. ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. దీంతో వారు తమ స్నేహితుల మధ్య కలిసిమెలసి ఉండలేక లోలోపల ఇబ్బందిపడుతుంటారు. మొటిమలు తగ్గినచోట మచ్చలు ఏర్పడి జీవితాంతం బాధిస్తూనే ఉంటాయి. 
 
ఇలాంటి వాటిని తగ్గించేందుకు గృహ చిట్కాలకు పాటిస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు. శెనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా తయారుచేసి ముఖానికి పట్టించాలి. ఇది 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తరచుగా ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. 
 
ఉల్లిరసంలో కొంచెం తేనె కలపాలి. దీన్ని మొటిమల మచ్చలపై రాయాలి. గంట తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. 
 
ఒక స్పూన్ మెంతులపొడి, ఒక స్పూన్ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్ టమోట రసం, కొబ్బరినీళ్లు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. 
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడుసార్లు చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరకట్న వేధింపుల కేసు.. ట్విషా శర్మ భర్త, అత్తకు కస్టడీ పొడిగింపు

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

కేరళలో షిగెల్లా కేసులు.. జనవరి నుంచి 146.. జూన్‌లో మాత్రమే 70 కేసులు

జనసేనలో కొత్తగా సమన్వయ కమిటీ : పవన్ కళ్యాణ్

బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి ముకేశ్ అంబానీ భారీ విరాళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంచన 4లో నటించనున్న లేడీ సూపర్ స్టార్ నయనతార?

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

తర్వాతి కథనం
Show comments