కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్ చేసి....?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:24 IST)
ముఖచర్మంపై మొటిమలు రావడానికి రోజూ తీసుకునే డైట్ కూడా కారణమంటున్నారు. కాలుష్యం నుండి చర్మాన్ని రక్షించుకున్నట్టే, ప్రతిరోజూ సరైన ఆహారాన్ని తీసుకోవడం వలన కూడా మొటిమలు ముఖంపై ఏర్పడే మచ్చలను దూరం చేసుకోవచ్చును. కొందరైతే అదేపనిగా కాఫీలు తాగుతుంటారు.. దీని వలన కూడా ముఖంపై మొటిమలు వస్తాయని చెప్తున్నారు. ఈ మొటిమ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
 
ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజూ క్రమంగా చేస్తే ముఖంపై మొటిమలు పోయి చర్మం తాజాగా, మృదువుగా తయారవుతుంది. 
 
2 స్పూన్ల కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే కూడా మొటిమలు పోతాయి. అలానే కలబంద గుజ్జును పాదాలకు రాసుకుని కాసేపటి తరువాత శుభ్రం చేస్తే పాదాలు మురికిపోయి మృదువుగా మారుతాయి.
 
అతిగా ప్రాసెస్ చేసిన పదార్థఆలు తినడం వలన కూడా అవి ఇన్సులిన్‌పై దాడి చేస్తాయి. అందుకే బేక్, ఫ్రై చేసిన జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు. లేదంటే మొటిమలు వచ్చేస్తాయి. వీటికి బదులు పండ్లు, కూరగాయలు తింటే మంచిది. ఒత్తిడి వలన కూడా మొటిమలు వస్తుంటాయి. దీని కారణంగా శరీరంలో హార్మోనల్ తేడావొస్తుంది. అందువలన బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ.. సరైన నిద్ర ఉంటే మొటిమలు దరిచేరవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యుద్ధంలో ఇరాన్ ఓడితే తర్వాత టార్గెట్ మేమే: పాకిస్తాన్ రక్షణ మంత్రి

ఎంకె స్టాలిన్‌తో జగన్ సంబంధాలు.. బీజేపీని ఎదిరించే ధైర్యం ఆయనకుందా?

వరుసకు చెల్లితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగింది.. చివరికి ఏమైంది?

ఇండియా వెళ్లేప్పుడు జాగ్రత్త అన్నారు, కానీ ఇక్కడకొచ్చి చూస్తే: విదేశీయురాలి అనుభవం

అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

తర్వాతి కథనం
Show comments