Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసం, పాలు సమంగా కలిపి అక్కడ మృదువుగా మర్దన చేస్తే...

Webdunia
బుధవారం, 8 మే 2019 (22:20 IST)
కొందరిలో ముఖంపై మంగుమచ్చలు వచ్చి ముఖం అందవికారంగా ఉండడం వలన మానసిక వేదనను అనుభవిస్తుంటారు. అవి ప్రమాదకరమైనవి కాదు, ఒకరి నుండి మరొకరికి వ్యాపించవు. జన్యు సంబంధ కారాణాల వల్ల, సూర్యరశ్మి ప్రభావం వల్ల మరియు హార్మోన్ల ప్రభావం వల్ల ఈ మంగు మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మనం వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
1. నిమ్మరసం, పాలు సమంగా కలిపి మచ్చలపై మృదువుగా మర్దనా చేయాలి. అలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
 
2.గులాబీ పూల పొడిలో తగినంత నిమ్మరసం చేర్చి పట్టిస్తూ ఉన్నట్లయితే క్రమంగా మచ్చలు పోతాయి.
 
3.ఉసిరిక పెచ్చుల పొడి, పసుపు సమానంగా కలిపి సేవిస్తున్నా మంగు మచ్చలు తగ్గుముఖం పడతాయి.
 
4. రాత్రిపూట 50 మి.లీ నీటిలో ఒక గ్రాము వేప బెరడు పొడి వేసి ఉదయాన్నే వడకట్టి 5 మి.లీ తేనె కలుపుకుని తాగినట్లయితే మంగు మచ్చలకు మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
5. ఒక భాగం శ్రీ గంధం పొడిలో దానికి రెట్టింపు బొప్పాయి గుజ్జుని చేర్చి బాగా కలిపి మంగు మచ్చలు ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వలన మంగు మచ్చలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments