Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్లటి పెరుగుతో చుండ్రు మాయం

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, నిమ్మరసాన్ని ఇలా వాడాలి అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు. కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫల

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (11:08 IST)
చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, నిమ్మరసాన్ని ఇలా వాడాలి అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు. కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది. 
 
అంతేగాకుండా రాతప్రూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్‌ మసాజ్‌ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేసినా చుండ్రు మాయమవుతుంది. అలాగే కొద్దిగా పెరుగును తీసుకుని దాన్ని 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ పెరుగు పులుస్తుంది. దీన్ని జుట్టుకు బాగా పట్టించి గంట సేపు అలాగే ఉంచాలి. అనంతరం కడిగేయాలి. పెరుగులో ఉండే యాసిడ్ గుణాలు చుండ్రుపై పోరాడతాయి. దీంతో ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. 
 
జుట్టుకు మంచి పోషణను అందించే కండిషనర్‌గా గోరింటాకు వాడొచ్చు. కొద్దిగా గోరింటాకు పొడి, టీ లిక్కర్, పెరుగులను ఒక చిన్న పాత్రలో తీసుకుని ఆ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దాన్ని 8 నుంచి 10 గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం జుట్టుకు పట్టించి, 1 గంట సేపు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో వైకాపా నేతల పాపం పండుతోంది... కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

ఉదయనిధి సభలో త్రిష నినాదాలు - నీళ్లు అక్కడికే చేరాలంటూ కామెంట్స్... టీవీకే నేతల ఫైర్

సహజీవనం చేసే మహిళను వేధిస్తే ఇక జైలే : సుప్రీంకోర్టు

డోనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కు - సుంకాలపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

ఆగష్టు 4, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sid Sriram: ది రెడ్ బ్యాగ్ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన మెలోడీ సాంగ్

డీప్‌ఫేక్ ఫోటోలు తక్షణం తొలగించండి.. లేదా చట్టపరమైన చర్యలు : మృణాల్ ఠాకూర్

Rashmika responds :గాయాలు కావడం మూడోసారి, దేవుడే రెస్ట్ తీసుకోమన్నాడు : రశ్మిక మందన్న

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

తర్వాతి కథనం
Show comments