Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలంలో ఐస్‌క్యూబ్స్‌తో చర్మ సౌందర్యం.. ఎలా? (video)

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:49 IST)
వేసవికాలంలో ఎండలో తిరగడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ఎలాగంటే..? 
 
* పెట్రోలియం జెల్లీలో కాస్త గ్లిజరిన్ వేసి, రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు పొడిబారిన చర్మానికి, చేతులకు, అలాగే కాళ్లకు రాస్తే శరీరం మృదువుగా మారుతుంది.
 
* దోసకాయ చెక్కు తీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో 1/2 టీస్పూన్ గ్లిజరిన్, 1/2 టీస్పూన్ రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి, ఆరేంతవరకు ఉంచిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కమిలిన భాగం మూమూలుగా అయిపోతుంది.
 
* చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు మచ్చలు, జిడ్డు, మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు కనీసం ఒక్కసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
 
* కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ, లావెండర్ సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేయడం వల్ల శరీరం మృదువుగా తయారవుతుంది. మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
 
* పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వ్యాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్నచోట రాస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేనట్లయితే గ్లిజరిన్, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే మృదువుగా తయారవుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అలాంటి వ్యక్తి రాష్ట్రాధినేత అయితే ఆ దేవుడే కాపాడాలి : ఉదయనిధిపై ఖుష్బూ మండిపాటు

ఏపీలో వైకాపా నేతల పాపం పండుతోంది... కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

ఉదయనిధి సభలో త్రిష నినాదాలు - నీళ్లు అక్కడికే చేరాలంటూ కామెంట్స్... టీవీకే నేతల ఫైర్

సహజీవనం చేసే మహిళను వేధిస్తే ఇక జైలే : సుప్రీంకోర్టు

డోనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కు - సుంకాలపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sid Sriram: ది రెడ్ బ్యాగ్ నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన మెలోడీ సాంగ్

డీప్‌ఫేక్ ఫోటోలు తక్షణం తొలగించండి.. లేదా చట్టపరమైన చర్యలు : మృణాల్ ఠాకూర్

Rashmika responds :గాయాలు కావడం మూడోసారి, దేవుడే రెస్ట్ తీసుకోమన్నాడు : రశ్మిక మందన్న

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

తర్వాతి కథనం
Show comments