వేసవిలో అందాన్ని కాపాడుకునేందుకు చిట్కాలు...

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (22:15 IST)
వేసవిలో ఎండల్లో తిరగడం వల్ల చర్మం పొడిబారినట్టుగా అవుతుంది. దీనికి అనేక రకములైన లోషన్స్ వాడుతుంటాము. అలాకాకుండా ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న పదార్దాలతోనే చిట్కాలు పాటించి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టిప్స్ అనుసరిస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. అవేంటో చూద్దాం.
 
1. బొప్పాయి రసాన్ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటుంటే సూర్యకాంతి వల్ల చర్మంపై ఏర్పడే గోధుమ రంగు మచ్చలు తగ్గిపోతాయి. చర్మం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి వాడాలి.
 
2. ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఓట్ మీల్, పాలు తీసుకుని కలపాలి. ఈ మిశఅరమాన్ని శుభ్రం చేసుకున్న ముఖానికి రాసుకోవాలి. దానిని మీ చేతివేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖఁపై ఉండే మృతకణాలు, అధికంగా ఉండే నూనెలు, దుమ్ముధూళి పోయి చర్మం శుభ్రపడుతుంది. పదిహేను నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగివేయాలి.
 
3. మృదువైన చర్మం కోసం అరచెక్క నిమ్మరసాన్ని ఒక గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.
 
4. ఇంట్లో చేసిన ఫేస్ ప్యాక్‌లే వాడాలి. అంటే పెరుగు, గంధం, టొమాటో జ్యూస్, కలబంద గుజ్జు కలిపిన ప్యాక్ ముఖానికి వేయాలి. ఈ మిశ్రమం ముఖచర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా మెరుపును కూడా ఇస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా పేరు మార్చే అంశాన్ని పరిశీలిస్తాం : కేటీఆర్

ఏపీ ఐటీ రంగంలో కీలక పరిణామం - వైజాగ్‌లో ఐబీఎం సేవలు

రక్షణ కల్పించాలంటే పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిని పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..

వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)

ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

తర్వాతి కథనం
Show comments