Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుంటే?

శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగితే మీ ముఖం అందంగా మృదు

Webdunia
శుక్రవారం, 1 జూన్ 2018 (11:40 IST)
శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగితే మీ ముఖం అందంగా మృదువుగా కనిపిస్తుంది. అరటిపండు గుజ్జులో పెరుగు, సెనగపిండి, గుడ్డులోని తెల్లని సొన ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని బాగా కలిపి ముఖానికి రాసి, అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మెరుస్తుంది.
 
బొప్పాయి గుజ్జులో కీరదోస రసాన్ని కలిపి అందులో తేనె, గంధపుపొడి, ముల్తాని మట్టి ఒక్కొక్క స్పూన్ వేసి దానిలో కొంచెం పాలు కలిపి పేస్టుగా తయారుచేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత నీటిలో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మచ్చలు తొలగిపోతాయి. 
 
రెండు స్పూన్ల బియ్యపు పిండిలో అరస్పూన్ తేనె, కొంచెం చల్లని టీ డికాషన్ కలిపి బాగా కలుపుకుని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత కడిగివేస్తే ముఖం మెరిసిపోతుంది. బంగాళాదుంపను మెత్తని గుజ్జుగా చేసుకుని ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి కడిగేస్తే నల్లటి మచ్చలు తొలగిపోవుటకు తయారపడుతుంది. 
 
నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానిక పట్టించి అరగండ తరువాత కడిగేస్తే ముఖం మృదువుగా ఉంటుంది. కొబ్బరిపాలను దూదిలో ముంచుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. దోసకాయ రసంలో కొంచెం నిమ్మరసం, రోజ్‌వాటర్ కలుపుకుని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడుక్కుంటే మంచిది.
 
బార్లీ గింజలు, గసగసాలు పేస్టుగా తయారుచేసుకుని అందులో కొంచెం నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో కడిగితే ముఖం అందంగా మెరిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

తర్వాతి కథనం
Show comments