Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనుమరుగవుతున్న గులాబీ రంగు కాగితం

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (14:27 IST)
దేశవ్యాప్తంగా 2వేల రూపాయల నోటు చలామణీ బాగా తగ్గిపోయింది. ఈ మధ్య కాలం వరకు ఎక్కువగా కనిపించే 2 వేల నోటు ఉన్నట్లుండి కనుమరుగవుతోంది. బ్యాంకులు, ఏటీఎంలలో కూడా 100, 500 రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో పెద్ద నోట్లు కావాలని అడిగినా కూడా లేవనే సమాధానం వస్తోంది. 
 
అయితే ఎన్నికలు జరుగుతుండటంతో వాటిని ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయకుండా ఆపినట్లు కొందరు భావిస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు కూడా తమ బ్యాంకుల్లో వచ్చే డిపాజిట్లలో 2 వేల నోట్లు చాలా తక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఇంకా వ్యాపారులు కూడా తమ కస్టమర్లు ఇదివరకు ఎక్కువగా 2 వేల నోట్లనే ఇచ్చేవారని కానీ ఇప్పుడు అందరూ 500 నోట్లనే ఇస్తున్నారని అంటున్నారు.
 
కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బును కొందరు బడా నాయకులు పెద్ద నోట్లుగా మార్చుకుని దాచుకుంటున్నారని కొందరు బ్యాంకర్ల వాదన. గతేడాది చలామణీలో ఉన్న నోట్లలో 2 వేల నోట్లు 37 శాతం ఉండగా ఈ ఏడాది దాని శాతం బాగా పడిపోయిందని తెలుస్తోంది. ఏదేమైనా సామాన్యులు మాత్రం 2 వేల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా ఉందని, అది చలామణీలో లేకపోవడమే మంచిదని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments