కనుమరుగవుతున్న గులాబీ రంగు కాగితం

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (14:27 IST)
దేశవ్యాప్తంగా 2వేల రూపాయల నోటు చలామణీ బాగా తగ్గిపోయింది. ఈ మధ్య కాలం వరకు ఎక్కువగా కనిపించే 2 వేల నోటు ఉన్నట్లుండి కనుమరుగవుతోంది. బ్యాంకులు, ఏటీఎంలలో కూడా 100, 500 రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో పెద్ద నోట్లు కావాలని అడిగినా కూడా లేవనే సమాధానం వస్తోంది. 
 
అయితే ఎన్నికలు జరుగుతుండటంతో వాటిని ఉద్దేశపూర్వకంగానే విడుదల చేయకుండా ఆపినట్లు కొందరు భావిస్తున్నారు. మరోవైపు బ్యాంకర్లు కూడా తమ బ్యాంకుల్లో వచ్చే డిపాజిట్లలో 2 వేల నోట్లు చాలా తక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఇంకా వ్యాపారులు కూడా తమ కస్టమర్లు ఇదివరకు ఎక్కువగా 2 వేల నోట్లనే ఇచ్చేవారని కానీ ఇప్పుడు అందరూ 500 నోట్లనే ఇస్తున్నారని అంటున్నారు.
 
కాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బును కొందరు బడా నాయకులు పెద్ద నోట్లుగా మార్చుకుని దాచుకుంటున్నారని కొందరు బ్యాంకర్ల వాదన. గతేడాది చలామణీలో ఉన్న నోట్లలో 2 వేల నోట్లు 37 శాతం ఉండగా ఈ ఏడాది దాని శాతం బాగా పడిపోయిందని తెలుస్తోంది. ఏదేమైనా సామాన్యులు మాత్రం 2 వేల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా ఉందని, అది చలామణీలో లేకపోవడమే మంచిదని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments