Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona pandemic: ఏపీ బ్యాంకులు ఇక రోజుకు 4 గంటలే పనిచేస్తాయ్!

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (22:56 IST)
బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్న వేళ.. బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఏపీలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి (ఏప్రిల్ 23,2021) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మే 15 వరకు ఈ రూల్స్ కొనసాగుతాయి. పరిమిత సిబ్బందితో బ్యాంకులు చేయాలని, పలువురు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా బ్యాంకర్ల సమితి తెలిపింది.
 
కాగా, కరోనా రెండో వేవ్‌లో తెలంగాణలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కోవిడ్‌ బారిన పడుతున్నారని ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్‌ 30వరకు సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments