Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికేన్ వల్లే ఇంధన ధరలు పెరుగుదల : పెట్రోలియం మంత్రి

కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:40 IST)
కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 
 
గత రెండు నెలలుగా ఇంధన ధరలు పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, అమెరికాను వణికించిన హార్వే, ఇర్మా తుఫానుల కారణంగా, అంతర్జాతీయంగా రిఫైనరీ ఔట్ పుట్ 13 శాతం పడిపోయిందని... ఈ కారణంగానే ఇంధన ధరలు పెరిగాయన్నారు. 
 
అయితే, దీపావళి నాటికి వీటి ధరలు తగ్గుతాయన్నారు. వచ్చే నెలలో ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. రోజువారీ ఇంధన ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధానంపై విమర్శలు వచ్చినప్పటికీ... మంత్రి మాత్రం రోజువారీ ధరల సమీక్ష చాలా పారదర్శకంగా ఉందని సమాధానం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments