Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధిరేటులో పాకిస్థాన్ కంటే వెనుకబడిన భారత్?

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (12:01 IST)
ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నది ప్రతి ఒక్కరి భావన. కానీ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన జీడీపీ వృద్ధిరేటులో భారత్ ఆరేళ్ళ కనిష్టానికి పడిపోయింది. పైగా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్ వంటి దేశాల వృద్ధిరేటు కంటే తక్కువగా నమోదైంది. ప్రస్తుతం భారత్ వృద్ధిరేటు 5 శాతంగా ఉంటే, పాకిస్థాన్ వృద్ధిరేటు 5.4 శాతం, భూటన్ వృద్ధిరేటు 7.4 శాతం, నేపాల్ వృద్ధిరేటు 7.9 శాతం, బంగ్లాదేశ్ 8.31 శాతంగా ఉన్నట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక గత నెల 30వ తేదీన వెల్లడించింది.
 
మరోవైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కామ్‌లో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం కూడా ఈ వృద్ధిరేటుపై వెటకారంగా మాట్లాడారు. ఆయన కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఒక విలేకరి తన కస్టడీ గురించి చెప్పాలని కోరగా 'రాజకీయ నాయకులు చెప్పాలి.. ఐదు శాతం. 5 శాతం అంటే ఏమిటో మీకు తెలుసా?' అని ఎగతాళిగా మాట్లాడుతూ.. తన ఐదు వేళ్లను మీడియాకేసి చూపారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం క్షీణించింది అనడానికి ఉదాహారణగా చిదంబరం ఐదు వేళ్లను చూపించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మందగించి, ఆరు సంవత్సరాల కనిష్టానికి చేరిన నేపథ్యంలో చిదంబరం ఇలా తన చేతి వేళ్లతో బీజేపీ ప్రభుత్వ పని తీరును ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments