Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ బులెటిన్ : రూ.400 తగ్గిన పసిడి తులం ధర

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (08:15 IST)
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్‌ పడిపోవడంతో ధరలు నేలచూపుచూస్తున్నాయి. 
 
దేశరాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.390 తగ్గి రూ.48 వేల దిగువకు చేరుకుంది. బులియన్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.47,910 వద్ద నిలిచింది. గడిచిన వారం రోజుల్లో బంగారం రూ.2 వేలకు పైగా తగ్గినట్లు అయింది. 
 
అదేవిధంగా హైదరాబాద్‌లో తులం పసిడి ధర రూ.760 తగ్గి రూ.49,640 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.45,500గా ఉన్నది. కిలో వెండి ఏకంగా రూ.2 వేలు తగ్గి రూ.75,500 నిలిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటంతో అనూహ్యంగా డాలర్‌కు డిమాండ్‌ నెలకొంది. దీంతో బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments