Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు శుభవార్త... ఏంటది?

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (14:42 IST)
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు తక్షణం బెర్తు కేటాయించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేపట్టింది. ఈ ప్రయత్నాలు శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయోగాత్మకంగా చేపట్టగా అవి విజయవంతమయ్యాయి. దీంతో మిగిలిన రైళ్ళలో కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. 
 
సాధారణంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కేటాయిస్తారు. అయితే రెండు, మూడు స్టేషన్‌ల వరకు ఎదురుచూసిన తర్వాత మాత్రమే టీటీఈ ఆ బెర్త్‌ను కేటాయిస్తాడు. ఇకపై అలాంటి అవసరం ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 
 
మొదటి స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరిన తర్వాత ఎవరైనా ప్రయాణికుడు కన్ఫర్మ్‌ అయిన తన టికెట్‌ను రద్దు చేసుకుంటే, వెంటనే ఆ టికెట్‌ను నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికుడికి ఇస్తారు. రద్దయిన టికెట్‌ గురించి వెంటనే టీటీఈకి హ్యాండ్‌హెల్డ్‌ డివైజెస్‌ ద్వారా సమాచారం అందిస్తారు.
 
శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఇప్పటికే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నిర్వహించారు. మొదటి దశలో టీటీఈలకు 500, రెండో దశలో 8 వేల హ్యాండ్‌హెల్డ్‌ డివైజెస్‌ అందజేస్తారు. ఈ విధానాన్ని అని రైళ్లలో ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం