Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివో, ఒప్పో ఫోన్ల అమ్మకాలు డౌన్-తట్టా బుట్టా సర్దుకుని చైనాకు ఉద్యోగులు?

చైనా ఉత్పత్తులకు భారతీయులు గట్టి షాక్ ఇచ్చారు. చైనా ఉత్పత్తులను కొనడంపై భారతీయులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. భారత్-చైనాల మధ్య డోక్లామ్ సమస్యే ఇందుకు ప్రధాన కారణమైందని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (13:42 IST)
చైనా ఉత్పత్తులకు భారతీయులు గట్టి షాక్ ఇచ్చారు. చైనా ఉత్పత్తులను కొనడంపై భారతీయులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. భారత్-చైనాల మధ్య డోక్లామ్ సమస్యే ఇందుకు ప్రధాన కారణమైందని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డోక్లామ్ సమస్యకు తెరపడేలా భారత విదేశాంగ శాఖ డోక్లామ్ నుంచి భారత బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసిన నేపథ్యంలో.. డోక్లామ్ విషయంలో చైనా చేసిన అనవసర రాద్ధాంతంతో చైనా ఉత్పత్తులపై వ్యతిరేకత మొదలైంది. గతంలో చైనా ఉత్పత్తులంటే ఎగిరి గంతేసే భారతీయులు ప్రస్తుతం వాటిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు.
 
అంతేగాకుండా.. చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారం చైనా మొబైళ్ల  విక్రయాలపై ప్రభావం చూపింది. తద్వారా చైనా మొబైల్ ఉత్పత్తుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో వివో, ఒప్పో కంపెనీల ఫోన్లను కొనేవారే కరువయ్యారు.

గత రెండు నెలలుగా వీటి అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే 350కి మించిన ఉద్యోగులు తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి వెళ్ళిపోయారు. కానీ సదరు కంపెనీలు మాత్రం అమ్మకాలు బాగానే జరుగుతున్నట్లు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments