Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లారని పెట్రో మంట : తాజాగా 35 పైసలు వడ్డన

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (08:24 IST)
దేశంలో పెట్రో మంట ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. గత నెల చివరి వారం నుంచి వరుసగా పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యుడి బతుకు భారమవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతిరోజూ మారుతుండటంతో నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయి. ఒకవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నా.. మరోవైపు సాధారణ ప్రజానీకం గగ్గోలు పెడుతున్నా ఆయిల్ కంపెనీలతో పాటు.. కేంద్రం మాత్రం తమకేం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. 
 
ఇప్పటికే రికార్డు స్థాయిలో కొనసాగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరోసారి 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.108.29, డీజిల్‌ ధర రూ.97.02కు చేరాయి. 
 
ఇక ముంబైలో పెట్రల్‌ రూ.114.14, డీజిల్‌ రూ.105.12కు చేరగా, చెన్నైలో పెట్రోల్‌ రూ.105.13, డీజిల్‌ రూ.101.25, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.78, డీజిల్‌ రూ.100.14కు చేరాయి.
 
తాజా పెంపుతో లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 36 పైసలు, 38 పైసల చొప్పున అధికమయ్యాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌ ధర రూ.105.84, పెట్రోల్‌ రూ.112.63కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments