Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కామ్... రూ.కోట్లు గోల్‌మాల్

దేశంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పి.ఎన్.బి)లో ఏకంగా రూ.11,346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. సరైన లెక్కా పత్రాలు లేకుండా బ్యాంకు సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన ప్రముఖ జు

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (09:07 IST)
దేశంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పి.ఎన్.బి)లో ఏకంగా రూ.11,346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. సరైన లెక్కా పత్రాలు లేకుండా బ్యాంకు సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన ప్రముఖ జువెలరీ డిజైనర్‌ నీరవ్‌ మోడీ, అతడి అనుచరులు కొందరు ఈ మొత్తాన్ని కొలగొట్టారు. 
 
విదేశాల్లోని సరఫరాదారులకు చెల్లించేందుకు బ్యాంకుల్లో పైసా కూడా నగదు డిపాజిట్‌ చేయకుండా వీరు అక్రమంగా లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఒయు) పొంది రూ.11,346 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్టు పీఎన్‌బి ఆడిటింగ్ విభాగం గుర్తించింది. ఈ వ్యవహారం 2011 నుంచి బ్యాంకు సిబ్బంది సహకారంతో జరుగుతూ వచ్చింది. 
 
ఈ విషయాన్ని సిబిఐకి ఫిర్యాదు చేసినట్టు పిఎన్‌బి స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. ఈ కుంభకోణానికి బాధ్యులను చేస్తూ బ్యాంక్‌ శాఖ డిప్యూటీ మేనేజర్‌తో సహా 10 మంది ఉద్యోగులపై పిఎన్‌బి వేటు వేసింది. అలాగే, నీరవ్ మోడీ మోసాలపై సిబిఐకి పిఎన్‌బి ఫిర్యాదు చేయడం గత 10 రోజుల్లో ఇది రెండోసారి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments