Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైవేటు పరం?

Webdunia
బుధవారం, 10 జులై 2019 (09:56 IST)
భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, దేశంలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తొలుత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇదే జరిగితే ప్రయాణికులపై భారం పడనుంది. ఈ నిర్ణయాన్ని రైల్వే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆందోళనకు దిగాలని భావిస్తున్నాయి. 
 
దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణతో పాటు ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయం పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ వంటి సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్‌డీసీ) చేతికి అప్పగించడం జరిగింది. దీంతోపాటు జోన్లలో ఉన్న మరికొన్ని రైల్వే స్టేషన్లు కూడా ఐఆర్ఎస్‌డీసీ చేతికే అప్పగించాలని భావిస్తోంది. 
 
ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల ఫ్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. దీంతో శాశ్వత కార్మికులపై అమితమైన భారంపడనుంది. దీంతో రైల్వే కార్మికులు రైల్వేశాఖ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments