Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేయకుంటే బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయనున్న ఎస్బీఐ

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:45 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌గా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు ఓ హెచ్చరిక చేసింది. తమ బ్యాంకులో ఖాతాలు కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్‌ చేసుకోవాలని సూచించింది. 
 
బ్యాంకు పనులను సజావుగా జరగాలంటే ఆధార్‌, పాన్‌ కార్డులను అనుసంధానం చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.
 
కాగా, పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయడానికి గడువు సెప్టెంబర్‌ 30వ తేదీ. మీరు పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయకపోతే మీ పాన్‌కార్డు డియాక్టివేట్‌ అవుతుంది. పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడం అనేది ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. 
 
ఈ ఆధార్‌ లింక్‌ను జూన్‌ 30వ తేదీ వరకు గడువు ఉండగా, దానిని పొడిగించారు. మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయకపోతే సెక్షన్‌ 234 హెచ్‌ కింద వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
 
అందువల్ల అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయాలని సూచిస్తున్నాయి. ఈ రెండింటిని అనుసంధానం చేయడం వల్ల బ్యాంకు లావాదేవీలు సజావుగా జరుపుకోవచ్చని ఎస్‌బీఐ సూచించింది.న్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడం ఎలా..? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments