Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు నగల తయారీలో నాణ్యత పాటించలేదనీ...

Webdunia
సోమవారం, 26 జులై 2021 (16:37 IST)
హైదరాబాద్ నగరంలో ఇద్దరు స్వర్ణకారులపై మరికొందరు వ్యక్తులు విచక్షణ రహితంగాదాడి చేశారు. బంగారు నగల తయారీలో నాణ్యత పాటించకపోవడంతో ఆగ్రహించిన కొందరు వ్యాపారులు వారిపై దాడి చేశారు. హైదరాబాద్లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. 

ఈ వివరాలను పరిశీలిస్తే, చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెలపురా ప్రాంతంలో కొందరు బెంగాలీలు ఆర్డర్లపై బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. వీరికి ఇద్దరు తయారీదారులకు కొందరు వచ్చి బంగారు ఆభరణాలు చేయాలంటూ సూచించారు. 

నగల తయారీలో నాణ్యత పాటించకుండా నమ్మక ద్రోహం చేశారని స్వర్ణకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన వ్యాపారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఇద్దరు స్వర్ణకారులను సిలిండర్‌కు కట్టేశారు. అనంతరం విచక్షణ మరచి రెచ్చిపోయారు. 

కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితులు వదిలేయమని ప్రాధేయపడినా సరే నిందితులు వినలేదు. ఒకరి తరువాత ఒకరు ముకుమ్మడిగా దాడిచేశారు. ఒంటిపై వాతలు వచ్చేలా కర్కశంగా చావబాదారు. చుట్టు ఉన్నవారు కనీసం వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments