Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (17:35 IST)
ఊహించినట్టే జరిగింది. భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
ఆర్బీఐ గవర్నరుగా ఉర్జిత్ పటేల్ 2016 సెప్టెంబరు 4వ తేదీన నియమితులయ్యారు. ఆ తర్వాత దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 నోట్లను దేశంలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అదేసమయంలో తొలిసారి రూ.2000 నోటుకు ప్రవేశపెట్టారు.
 
ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 
 
ఇలా నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. వృద్ధిరేటు గణనీయంగా పడిపోయింది. పెట్రోల్, డీజల్ ధరలు ఆకాశానికి తాకాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగిపోయింది. 
 
వీటిన్నింటి ప్రభావం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పినట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యన్ కూడా రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments