Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీ ఎయిర్‌లైన్స్‌ బంపర్ ఆఫర్... రూ.9కే టిక్కెట్

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (16:28 IST)
వియత్నాంకు చెందిన వియత్ జెట్ విమానయాన సంస్థ తన సేవలను భారత్‌లో విస్తరించనుంది. ఇప్పటికే బికినీ ఎయిర్‌లైన్స్‌గా గుర్తింపు పొందిన వియత్ జెట్ ఎయిర్‌లైన్స్... భారత్ - వియత్నాంల మధ్య విమాన సర్వీసులను వచ్చే డిసెంబరు నెలలో ప్రారంభించనుంది. 
 
డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచిమిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది. హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని సంస్థ వెల్లడించింది.
 
ఈ సర్వీసులు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ.9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్‌వర్క్‌లో భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియత్‌జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్‌ తన్ సన్  తెలిపారు. 
 
కాగా వియత్‌జెట్ డిసెంబర్ 2011లో తన సేవలను ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అంతేకాదు, ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్‌లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments